ఖేడ్ లో ఆర్టీవో కార్యాలయం ఏర్పాటుకు సంతకాల సేకరణకు భారీ స్పందన

byసూర్య | Sun, Sep 22, 2024, 11:04 AM

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఆర్టీవో కార్యాలయం ఏర్పాటుకై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాజీవ్ చౌరస్తాలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ ఆనంద్ మాట్లాడుతూ... నారాయణఖేల్ నియోజకవర్గం లో సుమారు 3 లక్షల మంది ప్రజలు ఉంటారని వారికి అనుకూలంగా స్థానికంగా ఆర్టీవో కార్యాలయం లేకపోవడంతో జహీరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్ళవలసి వస్తుందని అంతేకాకుండా అక్కడ బ్రోకర్లు కూడా భారీగా పెరిగిపోవడంతో ఖర్చులు అధిక మొత్తంలో అవుతున్నాయని మరియు దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఒక రోజు పని వదులుకొని వెళ్ళాడానికి ఇష్టపడతలేరని కొంతమంది యువకులు లైసెన్స్ లేకుండా అలాగే వాహనాలు నడుపుతూ ఉంటున్నారని స్థానికంగా ఆర్టిఓ కార్యాలయం ఏర్పడితే వెనుకబడిన ప్రాంతంలో కొంతమందికి ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశాలు వారు తెలియజేశారు. అందులో భాగంగా నేడు సంతకాల సేకరణ కార్యక్రమంలో యువకులు ఆటో డ్రైవర్లు భారీ ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిరంజీవి, దత్తురెడ్డి అశోక్,సతీష్ ,పుప్పాల అశోక్ రాము తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


Latest News
 

నేడు రిజ్వాన్ ను వెంటబెట్టుకుని హైదరాబాదులో తనిఖీలు Sun, Sep 22, 2024, 04:14 PM
నల్ల చెరువులో 14 ఎకరాల మేర కబ్జా జరిగినట్లు గుర్తింపు Sun, Sep 22, 2024, 02:33 PM
అన్ని శాఖల సమన్వయంతో గంజాయి నిర్మూలనకు కృషి Sun, Sep 22, 2024, 01:16 PM
వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి Sun, Sep 22, 2024, 01:13 PM
ఆరు గ్యారంటీలు అమలు కాంగ్రస్ తోనే సాధ్యం Sun, Sep 22, 2024, 01:10 PM