బీజేపీతోనే దేశ అభివృద్ధి.. మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పుగాళ్ళ శ్రీకాంత్ రెడ్డి

byసూర్య | Sun, Sep 22, 2024, 11:02 AM

బీజేపీ తోనే దేశ అభివృద్ధి చెందుతుందని ఆత్మకూరు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పుగాళ్ళ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మండల అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం,బీజేవైఎం మండల అధ్యక్షులుపో రెడ్డి ప్రదీప్ రెడ్డి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉప్పుగాళ్ళ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు యువకులు చాలామంది ఉత్సాహం చూపు తున్నారాని మండలంలోని అన్ని గ్రామాలలో యువకులందరు హిందూ ధర్మ రక్షణ కోసం యూవత కంకణం  కట్టుకొని  బీజేపీ పార్టీకి అండగా నిలబడాలని వారు యూవతను కోరడం జరిగింది.
కులాలకు,మతాలకు అతీతంగా అందరూ బిజెపి పార్టీ సభ్యత్వం పొందాలని పిలుపునిచ్చారు. బిజెపి పార్టీ క్రియశీలా సభ్యత్వల కొరకు 8800002024 కు ఫోన్ చేయగలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సభ్యత్వ మండల సహ ప్రముక్ పో రెడ్డి ప్రదీప్ రెడ్డి మండల కార్యదర్శి తిప్పని రాంబాబు బొల్లపల్లి రాజు గౌడ్ బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి బండి శ్రవణ్ కుమార్ బూతు అధ్యక్షులు వాడికారి రాజు పెండ్యాల సునీల్ రెడ్డి కోరుకొప్పుల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

నల్ల చెరువులో 14 ఎకరాల మేర కబ్జా జరిగినట్లు గుర్తింపు Sun, Sep 22, 2024, 02:33 PM
అన్ని శాఖల సమన్వయంతో గంజాయి నిర్మూలనకు కృషి Sun, Sep 22, 2024, 01:16 PM
వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి Sun, Sep 22, 2024, 01:13 PM
ఆరు గ్యారంటీలు అమలు కాంగ్రస్ తోనే సాధ్యం Sun, Sep 22, 2024, 01:10 PM
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ Sun, Sep 22, 2024, 01:09 PM