స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో స్వచ్ఛత ప్రతిజ్ఞ కార్యక్రమం

byసూర్య | Sun, Sep 22, 2024, 10:56 AM

మంథని పట్టణంలోని కాకతీయ పాఠశాల విద్యార్థులతో మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమ - సురేష్ రెడ్డి  అధ్యక్షతన మున్సిపల్ సూపర్ డెంట్  ఎన్.మనోహర్ స్వచ్ఛత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా చైర్ పర్సన్  మాట్లాడుతూ మహాత్మ గాంధీ పరిశుద్ధమైన, ఆరోగ్యవంతమైన భారత్ ను ఆవిష్కరించాలన్న మహాత్ముని కలను నిజం చేసి చూపించాలని ప్రజల్లో ప్రతి ఒక్కరూ చెత్తను వీధుల్లో వేయకుండా జాగ్రత్త పడడమే కాకుండా ఇతరులు కూడా చెత్త వేయకుండా చూడాలని పరిసరాలను పరిశుభ్రత ఉంచు కునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని  తెలిపారు. ఈ కార్యక్రమములో స్థానిక కౌన్సిలర్ వి.కే రవి , 1వ వార్డు కౌన్సిలర్  గుండా విజయలక్ష్మి - పాపారావు, కాకతీయ స్కూల్ ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి & స్టాఫ్ పాల్గొన్నారు.


Latest News
 

పేదలకు వరం సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి Sun, Sep 22, 2024, 12:57 PM
పిడుగుపాటుతో పాడి గేదలు మృతి Sun, Sep 22, 2024, 11:57 AM
ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు Sun, Sep 22, 2024, 11:53 AM
పండ్ల మొక్కలు పెంచండి అదిగ లాభాలు పొందండి Sun, Sep 22, 2024, 11:51 AM
రైతు వేదిక బాగుంది.. నిర్వహణే భారమైంది ! Sun, Sep 22, 2024, 11:49 AM