హరీష్ రావు హార్డ్ వర్కర్.. కష్టపడేతత్వం ఉంది.. మంత్రి పొన్నం ప్రభాకర్

byసూర్య | Sat, Sep 21, 2024, 08:43 PM

బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హరీష్ రావు మంచి హార్డ్ వర్కర్ అని.. ఆయనకు కష్టపడేతత్వం ఉందని పొన్నం ప్రభాకర్ ప్రశంసించారు. నీటి పారుదల శాఖ మాజీ మంత్రిగా పని చేసిన అనుభవంతో.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు సూచనలు, సలహాలు కూడా ఇవ్వొచ్చని చెప్పుకొచ్చారు. అయితే.. ఇదే సమయంలో ఆయనపై సెటైర్లు కూడా వేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. మల్లన్నసాగర్ జలాశయాన్ని సందర్శించిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించగా.. వాటిపై పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.


హరీష్‌ రావు వేసిన ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్‌ రివర్స్‌లో మళ్లీ ప్రశ్నించారు. మల్లన్న సాగర్‌కు వచ్చిన నీళ్లు కాళేశ్వరం జలాలా.. లేదా ఎల్లంపల్లి నీళ్లా.. అనేది హరీష్‌ రావు చెప్పాలని డిమాండ్‌ చేశారు. హరీష్‌ రావు మంచి హార్డ్‌ వర్కరే అయినా.. అబద్దాలతో ప్రజలను మేనేజ్‌ చేస్తామంటే కుదరదంటూ పొన్నం మండిపడ్డారు. రాజకీయం చేయడం తమ ప్రాధాన్యత కాదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని రైతులకు సారునీరు ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని.. చెప్పుకొచ్చారు. హరీష్‌ రావు వేసిన ప్రశ్నలకు ఆయనే ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.


మలన్నసాగర్‌కు వచ్చిన నీళ్లు ఎక్కడివని.. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున హరీష్‌ రావును అడుగుతున్నట్టు పొన్నం ప్రభాకర్ తెలిపారు. నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని... అవి కాళేశ్వరం జలాలా లేదా ఎల్లంపల్లి నీళ్లా అనేది.. స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టాన్ని మేనేజ్‌ చేసేందుకు హరీష్‌ రావు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.


నీటి పారుదల శాఖ మాజీ మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు తన విలువైన సలహాలు, సూచలను ఇవ్వొచ్చని పొన్నం ప్రభాకర్ తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే.. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయిందని పొన్నం తెలిపారు. ఇంజనీర్‌ కాని ఇంజనీర్‌ అయిన కేసీఆర్‌ నిర్వాకం వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పూర్తిగా పనిరాకుండా పోయిందని ఆరోపించారు. కేసీఆర్‌ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ధ్వంసానికి కుట్ర జరిగిందని.. ప్రాజెక్టుకు పనిచేసిన అధికారులు కూడా చెప్పారని గుర్తుచేశారు. కేసీఆర్‌ పాలనలోనే కాళేశ్వరం కుంగిపోయి నిష్ప్రయోజనంగా మారిందని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.


Latest News
 

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM
అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్ Sat, Sep 21, 2024, 11:34 PM
విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన Sat, Sep 21, 2024, 11:29 PM
యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు Sat, Sep 21, 2024, 11:26 PM
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్,,,,ఆయన భార్యపై కూడా కేసులు Sat, Sep 21, 2024, 11:20 PM