స్వచ్ఛత హి సేవ - 2024 అవగాహన కార్యక్రమం

byసూర్య | Fri, Sep 20, 2024, 03:23 PM

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నిజాంపేట్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో స్వచ్ఛత హి సేవ - 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు తమతో పాటు ఇతరులకు రోడ్లపై చెత్త వేయకుండా ప్లాస్టిక్ కవర్లు వాడకం నిషేదించే దిశగా అవగాహనా కల్పించాలని కోరారు. తడి పొడి చెత్త వేరుచేసి, ఎప్పటికపుడ్డు పరిసర ప్రాంతాల పరిశుభ్రత, పాటించాలని సూచించారు.
మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులతో కలిసి స్వచ్ఛ ప్లేడ్జ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు రఘునాథ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సుకృత రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్  విజయ భాస్కర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ప్రార్ధబ్ సింగ్,ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM