సీఎంఆర్ గడువులోగా ఇవ్వాలి

byసూర్య | Fri, Sep 20, 2024, 03:20 PM

సీఎంఆర్ గడువులోగా ఇవ్వాలని రైస్ మిల్లుల యజమానులను అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. వేములవాడలోని పలు రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైస్ మిల్లులో బియ్యం నాణ్యతను పరిశీలించారు. ఆయా రైస్ మిల్లులకు ధాన్యం ఎంత కేటాయించారు? ఇప్పటి వరకు సీఎంఆర్ ఎంత ఇచ్చారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడారు.
రైస్ మిల్లర్లు తమకు ఇచ్చిన లక్ష్యాన్ని గడువు లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పెంచమని స్పష్టం చేశారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి, డీటీ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM