byసూర్య | Thu, Jul 25, 2024, 02:15 PM
జడ్చర్ల పట్టణంలోని ఎర్ర సత్యం ప్రాథమిక పాఠశాలలో గురువారం ఉదయం మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ అనుచరుడు హీదాయత్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పండ్లు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆవంచ అషు, యూనుసూ, షబ్బీర్, ఎర్ర సత్యం అభిమానులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.