byసూర్య | Thu, Jul 25, 2024, 02:45 PM
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంపై వివక్షత చూపుతూ తీవ్ర అన్యాయానికి గురి చేశారని సిపిఎం నాయకులు వెంకటేష్, రమేష్, అజయ్ లు మండిపడ్డారు. వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గ పరిధిలోని అమరచింత మండల కేంద్రంలో గురువారం రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ కేటాయింపుపై నిరసిస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని సమావేశపరిచి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.