byసూర్య | Thu, Jul 25, 2024, 02:13 PM
కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికై సోమశిల సిద్దేశ్వర వంతెన పనులను వేగవంతం చేయాలని, అదేవిధంగా నంద్యాల -కొల్లాపూర్ మీదుగా రైల్వే లైన్ మంజూరు చేయాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, నాగర్ కర్నూల్ జిల్లా బిజెపి అధ్యక్షులు ఎల్లని సుధాకర్ రావులు కోరారు. గురువారం ఢిల్లీలోని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించి వినతి పత్రం అందజేశారు.