byసూర్య | Thu, Jul 25, 2024, 02:11 PM
కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ను గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెడుతోంది. ఈ పద్దుపై ఉమ్మడి పాలమూరు వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పథకాలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా కేటాయింపులు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. జిల్లాలోని ప్రాజెక్టులకు నిధులు, విద్య, వైద్యం, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని, సీఎం సొంత జిల్లా కావడంతో భారీగా నిధులు వచ్చే అవకాశాలున్నాయని టాక్.