byసూర్య | Thu, Jul 25, 2024, 02:08 PM
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగలపల్లి గ్రామంలో విషజ్వరాలు ప్రబలడంతో బిజిఆర్ ఫౌండేషన్ చైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ రావు ఆధ్వర్యంలో గురువారం వైద్యాధికారుల సహాకారంతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయించారు. ఈ సందర్బంగా గ్రామపంచాయతీ సిబ్బందితో వీధుల్లో పిచికారి చేయించి అధైర్యపడవద్దని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.