byసూర్య | Thu, Jul 25, 2024, 02:05 PM
మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని భీమవరం-సూర్యాపేట రహదారి మరమత్తు పనులను గురువారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్డు పై కంకర పౌడర్ మిశ్రమాన్ని నింపి గుంతలు పూడ్పించారు. వాహనదారులు ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా పూర్తి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు.