byసూర్య | Fri, Jul 12, 2024, 03:11 PM
మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలక సంఘం కార్యాలయంలో పురపాలక చైర్మన్ అశోక్ గౌడ్, పాలకవర్గము ఆధ్వర్యంలో మమత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారిచే ఉచిత మెడికల్ ఆరోగ్య శిబిరము శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విశిష్ట అతిథిగా విచ్చేసిన స్థానిక శాసన సభ్యురాలు వాకిటి సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, వైద్య సిబ్బంది, పట్టణ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.