byసూర్య | Fri, Jul 12, 2024, 03:35 PM
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం పూల్ సింగ్ తండాలో విషాదం చోటు చేసుకుంది. తండాకు చెందిన రమేష్ అనే వ్యక్తి గురువారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి పదేళ్ల క్రితం వివాహమైంది. కాగా కుటుంబ సమస్యల కారణంగా ఐదు సంవత్సరాల నుండి భార్య కాపురానికి రావడం లేదు. ఈ నేపధ్యంలో రమేష్ మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు.