byసూర్య | Fri, Jul 12, 2024, 02:25 PM
పాలకుర్తి మండలం పుట్నూర్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల వైద్య సదుపాయం కల్పించాలని పుట్నూరు గ్రామానికి చెందిన వైద్య నరేష్ పెద్దపల్లి జిల్లా పాలనాదికారికి శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుత ఆరోగ్య కేంద్రంలో వైద్యులు ఉదయం పది గంటలకు వచ్చి మధ్యాన్నం మూడు గంటలకే ఇంటికి వెళుతున్నారని, ఆసుపత్రిలో సరైన వసతులు లేక రోగులు అనేక ఇబ్బంది పడుతున్నారని, మందుల కొరత కూడా ఉన్నదని వాపోయారు.