byసూర్య | Fri, Jul 12, 2024, 02:24 PM
ధర్మారం మండల వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను శుక్రవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ కు పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.