byసూర్య | Fri, Jul 12, 2024, 02:23 PM
వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని మండల స్పెషల్ ఆఫీసర్ జీవరత్నం, ఎంపీడీవో ధనుంజయ్ గౌడ్ అధికారులకు సూచించారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం మొగ్దూంపూర్ గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మొక్కలను నాటి, అంగన్ వాడి సెంటర్ పాఠశాలను సందర్శించి పరిశీలించారు. చిన్నారి విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు.