byసూర్య | Thu, Jul 11, 2024, 02:21 PM
భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం గురువారం స్వల్పంగా పెరుగుతోంది. భద్రాచలంలో 11. 5 అడుగుల మేర ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, రిజర్వాయర్ల నుంచి నీరు దిగువకు వస్తోంది. ఎగువన వాజేడు మండలం పేరూరు వద్ద కూడా నీటి మట్టం పెరుగుతోంది. కొత్త నీటితో గోదావరి కళకళలాడుతోంది.