byసూర్య | Wed, Jul 10, 2024, 02:58 PM
దొంగలు దొంగలు ఒకటై నడిగడ్డ ప్రాంతాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ డీకే అరుణ బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి పరీక్ష విమర్శలు చేశారు. మంగళవారం గద్వాల విజయోత్సవ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాకుండా అధికారం కోసమే రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తనను ఓడించాలని శపథాలు చేసి ఊరూరు తిరిగి ప్రచారం చేసినా ప్రజలకు తానేంటో తెలుసునని, అందుకే తనను గెలిపించాలని డీకే అరుణ అన్నారు.