byసూర్య | Wed, Jul 10, 2024, 12:09 PM
సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా ములకలపల్లి మండలం పూసగూడెం పంప్ హౌస్ ను మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వరావుపేట శాసనసభసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు పంపు హౌస్ లో చేపట్టిన పనుల వివరాలను మ్యాప్ ద్వారా మంత్రికి వివరించారు.