![]() |
![]() |
byసూర్య | Tue, Jul 09, 2024, 08:03 PM
హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం గణపతి పూజతో కల్యాణోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే, ఈ కార్యక్రమం కోసం చేసిన ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నంకు స్వాగతం పలికే సమయంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. దాంతో ప్రొటోకాల్ పాటించడం లేదంటూ అలిగి ఆలయం బయటే ఆయన కూర్చుండిపోయారు. వీఐపీలు వస్తున్న సమయంలో ఆలయం ఎదుట సరైన సెక్యూరిటీ లేదని మంత్రి, మేయర్ మండిపడ్డారు.