byసూర్య | Tue, Jul 09, 2024, 03:39 PM
ఖమ్మం జిల్లాలో పొద్దుటూరు, బాణాపురం ఘటనలు మరువక ముందే రఘునాథపాలెం మండలం రజాబ్ అలీ నగర్ కు చెందిన మరో రైతు బోడ ప్రసాద్ (32) సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భూమి విషయంలో పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. తన భూమిని ఓ కానిస్టేబుల్ అతని కూతురి పేరుపై అక్రమంగా పట్టా చేయించాడని బాధితుడు వాపోయాడు. తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.