byసూర్య | Tue, Jul 09, 2024, 03:12 PM
నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన మంగినపల్లి నర్సిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ రసాయనలు పిచికారి చేసే నూతన డ్రోన్ యంత్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు అని తెలిపారు. రైతుల అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.