byసూర్య | Mon, Jul 08, 2024, 08:20 PM
హైదరాబాద్లోని ఓ హోటల్కు వెళ్లిన కస్టమర్కు వింత అనుభవం ఎదురైంది. ఇష్టంగా పూరి ఆర్డర్ ఇచ్చి తిందామనుకున్న సమయంలో పూరి కూరలో కనిపించింది చూసి షాక్ అయ్యాడు. వెంటనే ప్లేట్ పక్కకు తోసేసి.. వాంతులు చేసుకున్నంత పని చేశాడు. ఇంతకు పూరి కూరలో ఏం కనిపించిందనేగా మీ అనుమానం. ఇంకేముంటుంది.. హోటల్ నిర్వహకుల నిర్లక్ష్యం. పూరి కూరలో ఓ పురుగు కనిపించింది. ఈగ, దోమ సైజులో కాకుండా బొద్దంక సైజులో ఉన్న ఆ పురుగుని చూసి కస్టమర్ షాక్కు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ గడ్డి అన్నారంలోని ఓ హోటల్కు వెళ్లిన కస్టమర్ పూరి ఆర్డర్ ఇచ్చాడు. వెయిటర్ వేడి వేడిగా పూరి తెచ్చివ్వగా.. ఓ రెండు ముద్దలు నోట్లో పెట్టుకున్నాడు. అంతే.. పూరి కూరలో ఓ పెద్ద సైజు పురుగు కనిపిచింది. అది చూడగానే కస్టమర్కు వాంతి చేసుకున్నంత పనైంది. ఇదేంటని హోటల్ నిర్వహకులను ప్రశ్నిస్తే వారు తప్పు జరిగిందని ఒప్పుకోకపోగా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో చేసేందేం లేక సదరు కస్టమర్ పూరి తినటంం పూర్తి చేయకుండానే బయటకు వచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలా వరకు హోటళ్లలో ఇలాంటి పరిస్థితులే ఉంటున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. డబ్బుల కోసం ఆరాటపడుతున్న హోటల్ నిర్వహకులు ప్రజల ప్రాణాల గురించి ఆలోచించటం లేదని మండిపడుతున్నారు. గల్లీ హోటళ్ల నుంచి స్టార్ హోటళ్ల వరకు ప్రతి చోట ఇలాంటి ఘటనలే వెలుగుచూస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండవని పోస్టులు పెడుతున్నారు.
కాగా, ఇటీవల కాలంలో హైదరాబాద్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రవేటు హాస్టళ్లలో ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. అక్కడి పరిస్థితులు చూసి అధికారులు సైతం నోరెళ్లబెడుతున్నారు. అపరిశుభ్రమైన కిచెన్లు, బల్లులు, బొద్దింకలు, ఎలుకలు తిరుగుతుండటం, కుళ్లిపోయిన కూరగాయలు, మాసంతో వంటలు చేస్తుండటాన్ని గుర్తించారు. అలాగే గడువు ముగిసిన వస్తువులతో వంటలు చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. ఈ మేరకు పలు హోటళ్లకు నోటీసులు ఇవ్వటంతో పాటు సీజ్ చేశారు.