ఒకరినొకరు తిట్టుకోవటం, ఆరోపలు చేసుకోవటం ఆపేద్దాం: కేంద్రమంత్రి బండి సంజయ్

byసూర్య | Mon, Jul 08, 2024, 08:18 PM

"ఎన్నికలైపోయినయ్.. ఇకపై ఒకరినొకరు తిట్టుకోవడం బంద్ చేద్దాం. రాజకీయ విమర్శలు, ఆరోపణలను పక్కనపెట్టి అభివృద్ధిపైనే ఫోకస్ చేద్దాం. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే గ్రామాల్లో అభివృద్ది సాధ్యం. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధ్యం. ఈ విషయంలో కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం అందించే బాధ్యత నేను తీసుకునేందుకు సిద్ధం.." అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సిరిసిల్లలో పర్యటించిన బండి సంజయ్.. మున్నూరుకాపు సంఘ కళ్యాణ మండపానికి రూ.10 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కళ్యాణ మండపం ఆవరణలో మొక్క నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్‌ను సంఘం నాయకులు సన్మానించారు.కుల సంఘం ఆఫీస్ ను నిర్మిస్తే ఆ సంఘంలోని నాయకులకే ఉపయోగపడుతోందని.. కానీ కుల సంఘాల తరపున కళ్యాణ మండపాలు నిర్మిస్తే ఆ కులంలోని ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతోందని బండి సంజయ్ తెలిపారు. ఇలాంటి వాటికి మాత్రమే ఎంపీ లాడ్స్ నిధులిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఏ కుల సంఘమైనా సరే.. ఆ కులంలోని పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ ఆదుకున్నప్పుడు మాత్రమే కుల సంఘాలకు మనుగడ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు బండి సంజయ్.


రెండోసారి ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించడంలో సిరిసిల్ల జిల్లా ప్రజల భాగస్వామ్యం ఉందన్నారు. రెండోసారి గెలవడం వల్లే మోదీ కేబినెట్‌లో చోటు దక్కిందన్నారు. జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్యం, రవాణా, జాతీయ రహదారులు, రైల్వేశాఖలతో పాటు సంక్షేమ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఆయా రంగాల నుంచి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తాని చెప్పుకొచ్చారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్రానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ఎన్నికలైపోయాయని... ఇకపై ఒకరినొకరు తిట్టుకోవడం ఆపేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. రాజకీయ విమర్శలు, ఆరోపణలను పక్కనపెట్టి అభివృద్ధిపైనే ఫోకస్ చేద్దామన్నారు. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేసారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పక్షాన సంపూర్ణ సహకారం అందించే బాధ్యత తాను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని.. ఇందుకు అందరూ సహకరించాలని బండి సంజయ్ కోరారు.


Latest News
 

స్పెషల్ పోలీసులు ఇలా చేయటం ఎన్నడూ అభిలషణీయం కాదు.. ఆర్ఎస్ ప్రవీణ్‌ Mon, Oct 28, 2024, 07:31 PM
డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM