byసూర్య | Sun, Jun 23, 2024, 09:43 PM
మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కలిశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా చిరంజీవిని కలిసిన బండి సంజయ్ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించి.. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని శాలువాతో సత్కరించారు. సంజయ్.. ఎంతో కష్టపడ్డారని.. తగిన పదవి లభించిందని చిరు తెలిపారు. ఈ క్రమంలో.. విద్యార్థి దశలో మీ సినిమాలకు నేను వీరాభిమాని అని తన ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ని చిరుతో షేర్ చేసుకున్నారు. ఇరువురి మధ్య రాష్ట్ర, దేశ రాజకీయాలపై అరగంటకుపైగా చర్చ నడిచింది. చిరంజీవిని కలవడం చాలా ఆనందంగా ఉందన్న బండి సంజయ్.. మర్యాదపూర్వకంగానే కలిశానని తెలిపారు.