byసూర్య | Wed, Jun 19, 2024, 05:19 PM
కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామంలోని గంగమ్మ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై రాజు బుధవారం తెలిపారు. మృతుడు జీన్ ప్యాంటు ధరించి ఉన్నట్లు, చెప్పులు, షర్ట్ చెరువు ఒడ్డున ఉన్నట్లు చెప్పారు. ఈ నెల 12న ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకున్నట్లు ఓపి స్లిప్ లభ్యమైనదన్నారు. అందులో యాదగిరిగా పేరు ఉందన్నారు. ఇట్టి వ్యక్తిని గుర్తుపట్టినచో దేవునిపల్లి పోలీసులను సంప్రదించాలన్నారు.