byసూర్య | Wed, Jun 19, 2024, 05:18 PM
నారాయణపేట పట్టణంలోనీ ఎస్ ఆర్ ఫంక్షన్ హాలులో రేపు అనగా గురువారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు అవగాహన సెమినార్ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్ అన్నారు. సదస్సులో సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్, వ్యవసాయ శాఖ, వ్యవసాయ శాఖ అనుబంధ అధికారులు పాల్గొని వానాకాలం పంటల సాగుపై అవగాహన కల్పిస్తారని చెప్పారు.