byసూర్య | Wed, Jun 19, 2024, 05:16 PM
నారాయణపేట మండలం జాజాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం పదవ తరగతి విద్యార్థులకు ఇవాళ అభ్యాస దీపిక పుస్తకాలను పంపిణీ చేసినట్లు ప్రధానోపాధ్యాయులు భారతి తెలిపారు. భౌతిక, జీవ, గణిత శాస్త్రం సబ్జెక్టులకు సంబంధించిన అభ్యాస దీపిక పుస్తకాలు అందించామని అన్నారు. వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఉద్ధేశ్యంతో సంగ్రహణాత్మక అభ్యాస దీపిక రూపొందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.