byసూర్య | Wed, Jun 19, 2024, 05:10 PM
నారాయణపేట ఎస్పీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో డిసిఆర్బి డిఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాలోని పోలీస్ అధికారులకు నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. భారత ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన భారత న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సంహిత, భారత సాక్ష్య అధీనియం చట్టాలపై అవగాహన కల్పించారు. కొత్త చట్టాలపై అవగాహన కలిగి వున్నప్పుడే విధులు సమర్ధవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. సీఐ శివశంకర్, పోలీసులు పాల్గొన్నారు.