byసూర్య | Wed, Jun 19, 2024, 04:30 PM
వానాకాలం పంటల సాగు విధానంలో అవలంబించాల్సిన విధానాలపై జరిగే రైతు చైతన్య అవగాహన సదస్సుకు పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్ అన్నారు. బుధవారం దామరగిద్ద మండలం దేశాయిపల్లి గ్రామంలో అవగాహన సదస్సు కర పత్రాలను రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్ ఆర్ ఫంక్షన్ హాలులో రైతు అవగాహన సదస్సు వుంటుందని అన్నారు.