byసూర్య | Wed, Jun 19, 2024, 02:30 PM
చేపల వల కాళ్లకు చుట్టుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్ఐ హరి ప్రసాద్ కథనం ప్రకారం. గోపాల్ పేట మండల పరిధిలోని ఎదుట్ల గ్రామంలో మంగళవారం కుర్మయ్య (41) అనే వ్యక్తి తన కుమారుడు, మరో వ్యక్తితో కలిసి ఊరు పక్కనే ఉన్న బావిలో చేపల వేటకు వెళ్లారని, చేపలు పడ్డాయని బావిలోకి దిగి చూడగా కాళ్లకు వల్ల చుట్టుకొని మృతి చెందినట్లు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.