byసూర్య | Wed, Jun 19, 2024, 02:24 PM
మహబూబ్ నగర్ బస్టాండ్ వెనకాల ట్యాంక్ బండ్ నిర్మాణంలో ప్లాట్లు కోల్పోయిన తమకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డికి ప్లాట్ల బాధితులు మంగళవారం వినతి పత్రం అందించారు. గత 40ఏళ్ళ క్రితం కొనుగోలు చేసిన ప్లాట్లను గత ప్రభుత్వంలో కోల్పోయామని, ఇతరచోట ప్లాట్లు కేటాయిస్తామన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలెక్టర్ హామీని నిలబెట్టుకోలేదని, తమకు న్యాయం చేయాలని బాధితులు పేర్కొన్నారు.