byసూర్య | Tue, Jun 18, 2024, 04:26 PM
భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండల కేంద్రంలో రూ. 135 లక్షలతో నూతనంగా నిర్మించిన కస్తూర్బాగాంధీ పాఠశాల భవనం, అదనపు తరగతి గదులను మంగళవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అంతకుముందు కస్తూర్భాగాంధీ పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థినీలు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే జీఎస్సార్ కు పుష్పగుచ్చం ఇచ్చి, శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు.