byసూర్య | Tue, Jun 18, 2024, 03:30 PM
ఎల్లారెడ్డి సెగ్మెంట్ నాగిరెడ్డిపేట మండలం రాఘవపల్లిలో మంగళవారం ఇద్దరు వ్యక్తులు నాగయ్యను గొంతుకోసి హత్యాయత్నం చేశారు. దివ్యాంగురాలైన నాగయ్య కూతురిపై గతంలో అత్యాచారం చేసిన 4గురు యువకులపై నాగయ్య ఫిర్యాదుతో కేసునమోదు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిలో ఇద్దరు నిందితులు కోర్టులో కేసు ట్రాయల్ లో ఉండగానే నాగయ్యపై హత్యయత్నం చేయగా, గాయాలతో నాగయ్యను ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు.