byసూర్య | Tue, Jun 18, 2024, 03:27 PM
జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలేలా ఉంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ నేత, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఇంటికి గద్వాల కాంగ్రెస్ ఇంఛార్జ్ సరిత వెళ్లారు. కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవద్దంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనలతో హుటాహుటిన మంగళవారం హైదరాబాద్ కు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బయలుదేరారు.