byసూర్య | Tue, Jun 18, 2024, 03:26 PM
మరికల్ మండలం తీలేరు గ్రామం వద్ద సంప్ హౌస్ నుండి కోయిల్ సాగర్ జలాశయానికి మంగళవారం ఎమ్మెల్యే చిట్టెం పర్నిక రెడ్డి నీటి పంపింగ్ ప్రారంభించారు. మోటర్లకు పూజలు చేసి పంపింగ్ ప్రారంభించారు. అనంతరం కృష్ణ నీళ్లలో పూలు చల్లి పూజలు చేశారు. జూరాల ప్రాజెక్టు నుండి నీటి నుండి కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తున్నట్లు చెప్పారు. డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.