byసూర్య | Tue, Jun 18, 2024, 03:24 PM
ధన్వాడ మండలం కొండాపూర్ గిరిజన గురుకుల కళాశాలలో బైపీసీ గ్రూప్ ఫస్టియర్ లో మిగిలిపోయిన సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎం. రాజారాం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదిలో ఉత్తీర్ణత సాధించిన గిరిజన విద్యార్థులు మాత్రమే వెంటనే తమ కళాశాలలో తగిన ధృవ పత్రాలతో 19/6/2024 తేదీన బుధవారం ఉదయం 10: 30 గంటలకు సంప్రదించాలని పేర్కొన్నారు.