byసూర్య | Sun, Jun 16, 2024, 07:02 PM
కోదాడ పట్టణంలో పలు ప్రాంతాల్లో కోదాడ ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో గంజాయి రవాణా చేస్తూ 11 మంది యువకులు శనివారం పట్టుబడ్డారు. వారి వద్ద నుండి నాలుగున్నర కేజీల గంజాయి , 2 ఆటోలు, 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సిఐ శంకరయ్య తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు యాదయ్య గోవర్ధన్ సిబ్బంది ఉన్నారు.