ఏపీ మాజీ సీఎం జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

byసూర్య | Sat, Jun 15, 2024, 08:12 PM

హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల నిర్మాణంపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ స్థలాలు, ప్రజలకు ఇబ్బందులు కలిగేలా చేపట్టిన నిర్మాణాలను కూల్చేస్తున్నారు. తాజాగా.. ఏపీ మాజీ సీఎం, వైఎస్సాఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం లోటస్‍పాండ్‍లో కూల్చివేతలు చేపట్టారు.


జగన్ నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు ఫిర్యాదులు అందాయి. ఫుట్‍పాత్ ఆక్రమించి జగన్ ఇంటి ముందు సెక్యూరిటీ పోస్ట్‌ల నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సాయంతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. జేసీబీలతో సెక్యూరిటీ పోస్టులను తొలగించారు. అయితే ఈ కూల్చివేతలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

స్పెషల్ పోలీసులు ఇలా చేయటం ఎన్నడూ అభిలషణీయం కాదు.. ఆర్ఎస్ ప్రవీణ్‌ Mon, Oct 28, 2024, 07:31 PM
డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM