byసూర్య | Sat, Jun 01, 2024, 11:23 AM
సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వైకుంఠాపురంలో హనుమాన్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉన్న హనుమాన్ విగ్రహానికి దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు.