byసూర్య | Sat, Jun 01, 2024, 09:49 AM
జోగులాంబ గద్వాల జిల్లా రైల్వే స్టేషన్ లో షీ టీమ్స్ మహిళలకు అందిస్తున్న సేవలు గురించి శుక్రవారం అవగాహన కల్పించారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, ఫోటోలు దిగే ప్రయత్నం చేసినా, బ్లాక్ మెయిల్ చేసి ఇబ్బందులకు గురి చేసినా షీ టీమ్ నెంబర్ 8712670312 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే గ్రామాల్లో బాల్యవివాహాల గురించి 1098 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. షీ టీం బృందం సభ్యులు పాల్గొన్నారు.