byసూర్య | Sat, Jun 01, 2024, 09:44 AM
విత్తనాల అక్రమ రవాణాలను, అక్రమ నిలువలను అడ్డుకోవడానికి వనపర్తి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ఎస్పీ రక్షిత కె మూర్తి తెలిపారు. పట్టణంలోని విత్తన గోడౌన్లను పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో కలిసి విత్తనాలు అక్రమ రవాణా జరగకుండా తనిఖీ నిర్వహిస్తామన్నారు. నకిలీ విత్తనాల అడ్డుకట్టకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.