byసూర్య | Fri, May 31, 2024, 03:31 PM
ఎరువులు, విత్తనాల కృత్రిమ కొరత సృష్టించే డీలర్లపై కఠిన చర్యలు ఉంటాయని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీలర్లు తప్పని సరిగా స్టాక్ బోర్డు, అమ్మకాల వివరాలు విధిగా ప్రదర్శించాలని, ఎం. ఆర్. పి ధరలకే అమ్మాలని, నకిలీ విత్తనాలు అమ్మే వారిపై నిఘా ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.