byసూర్య | Fri, May 31, 2024, 03:27 PM
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యంపల్ల పురుషోత్తం రెడ్డి తనపై తేదీ: 23-05-2024న జరిగిన దాడి విషయమై ఫిర్యాదు చేసిన రషీదు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయని ఎస్సై పై చర్యలు చేపట్టాలని, తనకు న్యాయం చేయాలని శుక్రవారం రాష్ట్ర డిజిపి కి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు లో సివిల్ పంచాయతీలో ఎస్సై ఏకపక్షంగా వ్యవహరిస్తూనట్లుగా ఆరోపించారు.