byసూర్య | Fri, May 31, 2024, 03:25 PM
కొండమల్లేపల్లి: గ్రామీణ ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలను అనుగుణంగా ఉపాధి కూలీని 600 రూపాయలు ఇవ్వాలని, పని దినాలను 200 రోజులకు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాదయ్య, బాల నారాయణ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.