byసూర్య | Fri, May 31, 2024, 02:12 PM
సంగారెడ్డి పట్టణం గణేష్ నగర్ కాలనీలో కొలువైన శ్రీ జగదాంబ సేవాలాల్ ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకురాలు లక్ష్మీ చందర్ ఆద్వర్యంలో వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య జగదాంబ అమ్మవారి మూలమూర్తికి అభిషేకాలు, అలంకరణ గావించి ఉత్సవ పూజలు జరిపారు. శ్రీ గణపతి, చండీ, మహాలక్ష్మీ హోమాది వైదిక క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. అమ్మవారి మహా ప్రసాదంగా అన్న సమర్పణ చేశారు.