byసూర్య | Tue, May 28, 2024, 07:07 PM
మహిళలకు రక్షణగా షీ టీమ్ ఉంటుందని ఏఎస్సై శ్రీదేవి అన్నారు. మంగళవారం నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులకు షీ టీమ్ ఓని అవగాహన కల్పించారు. ఆకతాయిల నుండి వేధింపులకు గురైతే షీ టీమ్ కు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు చేసిన వాటి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఫిర్యాదును నేరుగా లేదా 8712670398 నంబర్ ద్వారా చేయవచ్చని సూచించారు. మహిళలు, విద్యార్థులు అపరిచిత వ్యక్తుల నుండి అప్రమత్తంగా ఉండాలని అన్నారు.