byసూర్య | Tue, May 28, 2024, 07:05 PM
కల్వకుర్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ మండల నాయకులు తిమ్మయ్య మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి అందరిని ఆదుకున్న దేవుడని అన్నారు.