byసూర్య | Tue, May 28, 2024, 11:56 AM
పత్తి విత్తనాలు ఎక్కువ ధరకు అమ్మి రైతులను మోసం చేస్తున్న వ్యాపారపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాంజీర రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కార్యాలయంలో మంగళవారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు పృధ్విరాజ్ మాట్లాడుతూ ఒక్కో పత్తి ప్యాకెట్ 1400 రూపాయల నుంచి 1600 రూపాయల వరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. అధికారులు దుకాణాలు తనిఖీ చేసి అధిక ధరకు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.